Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం కోసం రూ.5,500 కోట్లు ఖర్చుపెట్టారట.. ఓటు ధర రూ.2వేలు?

ఎన్నికలంటేనే డబ్బు కుమ్మరించుకోవాల్సిందేనని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో డబ్బు బాగా కుమ్మరిస్తే ఓటర్లు ఓట్లేసేస్తారని.. రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా..

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (16:50 IST)
ఎన్నికలంటేనే డబ్బు కుమ్మరించుకోవాల్సిందేనని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో డబ్బు బాగా కుమ్మరిస్తే ఓటర్లు ఓట్లేసేస్తారని.. రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా.. నిజాయితీగా జరిగితే ప్రజలకు, ప్రజా సేవకులకు మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే డబ్బు లేనిదే ఎన్నికలు జరగదని.. యూపీ ఎన్నికలు మరోసారి నిరూపించాయి.

నోట్లు రద్దయ్యాక కూడా యూపీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రచారం కోసం రూ.5,500 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎంఎస్ సర్వేలో వెల్లడైంది. ఈ మొత్తంలో రూ.వెయ్యి కోట్లు ఓటుకు నోటుకోసమే ఖర్చు చేశారని తెలిసింది. ఒక్కో ఓటు విలువ సగటున రూ.750 అని తెలిపింది. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒక్క ఓటు పడటం కోసం రాజకీయ పార్టీ రూ.2వేలు ఇచ్చి ఓటును కొనుగోలు చేసినట్లు సీఎంఎస్ సర్వేలో వెల్లడి అయ్యింది. మూడింట ఒక వంతు మంది ఓటర్లు నగదు లేదా మద్యం స్వీకరించి, ఓటు వేశారని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి రూ.25 లక్షలు మాత్రమే ఖర్చు చేయవలసి ఉంటుంది. 
 
అయితే వారు చేసిన ఖర్చులో ఈ 25 లక్షల రూపాయలు సముద్రంలో నీటి బొట్టులాంటిదని తేలిపోయింది. ప్రచార కార్యక్రమాల్లో సాంకేతిక పరికరాలు, ఓటర్లు భారీగా డబ్బు పంచి పెట్టడం, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు, దుస్తులు పంపిణీ చేయడంతో భారీ మొత్తాన్ని రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. వీడియో వ్యాన్లు, భారీ తెరలను బహిరంగంగా పెట్టి ప్రచారం చేశారు. ఈ విధంగా చేసిన ప్రచారానికి రాజకీయ పార్టీలు దాదాపు రూ.600 కోట్ల నుంచి రూ.900 కోట్ల వరకు ఉంటుందని సీఎంఎస్ సర్వేలో తేలింది.

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments