Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లగా వున్నావనీ హేళన చేశారనీ.. కుటుంబానికే విషం పెట్టింది...

మహిళలను కించపరిచినా.. హేళన చేసినా వారు ఏమాత్రం సహించలేరు. తాజాగా ఓ మహిళను నల్లగా వున్నావంటూ కొందరు హేళన చేశారు. దీంతో ఆ కుటుంబం మొత్తాన్నే హత్య చేసేందుకు ఆమె విషం పెట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (11:42 IST)
మహిళలను కించపరిచినా.. హేళన చేసినా వారు ఏమాత్రం సహించలేరు. తాజాగా ఓ మహిళను నల్లగా వున్నావంటూ కొందరు హేళన చేశారు. దీంతో ఆ కుటుంబం మొత్తాన్నే హత్య చేసేందుకు ఆమె విషం పెట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రగ్యా సువర్సే అనే మహిళను తన అత్తమామలు, ఆడపడుచులు గత కొద్ది కాలం నుంచి నల్లగా ఉన్నావంటూ వేధించసాగారు. వారి వేధింపులు, హేళనలు తట్టుకోలేని బాధిత మహిళ.. ఆ కుటుంబాన్ని హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. 
 
ఇటీవల తమ సమీప బంధువు నివాసంలో జరిగిన ఫంక్షన్‌లో అత్తమామలు, ఆడపడుచులను హత్య చేయాలని డిసైడ్ అయింది. పప్పులో విషం కలిపిన ఆమె మొదట అత్తమామలు, ఆడపడుచులకు ఇచ్చింది. 
 
దీంతో తొలుత విషంతో కూడిన పప్పును ఆరగించిన వారిలో నలుగురు పిల్లలు, ఒక పెద్దాయన ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత 120 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... ప్రగ్యాను అదుపులోకి తీసుకుని వించారు. ఈ విచారణలో నేరాన్ని ఆమె అంగీకరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments