Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పతాగి బాత్రూమ్‌లోపడి చనిపోయిన కొడుకు.. బతికున్నాడని రాత్రంతా తల్లి సేవలు...

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (11:17 IST)
మహారాష్ట్రలో ఓ విషాదకర ఘటన వెలుగు చూసింది. తప్పతాగడం వల్ల బాత్రూమ్‌లో పడిన కన్నబడ్డ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలియని అతని తల్లి.. రాత్రంతా శవం పక్కనే కూర్చొని సపర్యలు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబై మహానగరంలోని కలినా ఏరియాకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి సోమవారం తాగిన మైకంలో బాత్‌రూంలో జారికిందపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
కొద్దిసేపటి తర్వాత బాత్‌రూం దగ్గరకు వెళ్లిన తల్లి.. కుమారుడు కదలిక లేకుండా పడి ఉండటాన్ని గమనించింది. అనంతరం అతడ్ని(శవం)బయటకు లాక్కువచ్చింది. అతడు బ్రతికే ఉన్నాడని భావించింది. తల​కైన గాయానికి పసుపు రాయటం మొదలుపెట్టింది.
 
రాత్రంతా శవానికి సపర్యలు చేస్తూ కూర్చుంది. అయితే మరుసటి రోజు ఉదయం కూడా కుమారుడు లేవకపోవటంతో బంధువులకు విషయం చెప్పింది. దీంతో వారు అక్కడికి వచ్చి, పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా.. అతడు చాలా సేపటి క్రితమే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు ప్రమాదవశాత్తు సంభవించిన మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments