Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ప్రేమజంట

Webdunia
గురువారం, 27 జులై 2023 (08:59 IST)
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్‌ జిల్లాల రహతా గ్రామంలో ఓ ప్రేమ జంట అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకుంది. అయితే, ఈ పెళ్లి కళ్యాణ మండపం లేదా దేవస్థానంలో జరుపుకోలేదు. ఓ శ్మశానవాటికలో జరుపుకుంది. దీనికి కారణం లేకపోలేదు. వధువు తండ్రి ఓ శ్మాశానవాటికలో ఓ కాపరిగా పని చేయడమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
రహతా గ్రామానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి స్థానికంగా ఉండే శ్మశానవాటికలో కాటికాపరిగా పని చేస్తున్నాడు. ఆయనది మహాసంజోగి సామాజిక వర్గం కూడా. కొన్నేళ్లుగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్మశానంలోనే ఉంటున్నారు. గంగాధర్ కుమార్తె మయూరీ శ్మశానంలోనే పుట్టి, పెరిగింది. 12వ తరగతి వరకు చదువుకుంది. 
 
అయితే, ఆమె షిర్డీకి చెందిన మనోజ్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం ఇరుకుటుంబాల పెద్దలకు తెలియడంతో వారంతా కలిసి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే, మయూరీ పుట్టి పెరిగిన చోటే ఆమె పెళ్లి చేస్తానని గంగాధర్ కోరడంతో ఆ జంట వివాహం శ్మశానంలో బంధువులు స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments