Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్గా దర్శనానికి వెళ్లి తిరిగివస్తూ... కుటుంబమంతా మృతి

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (13:09 IST)
మహారాష్ట్రలోని నాందేడ్‌లో దారుణం జరిగింది. దర్గా దర్శనానికి వెళ్లి ఇంటికి తిరిగి వెళుతూ ఓ కుటుంబమంతా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృత్యువాతపడ్డారు. ప్రమాదవశాత్తు చెరువులో పడిన తమ వ్యక్తిని రక్షించేందుకు మిగిలివారు కూడా చెరువులోకి ప్రాణాలు కోల్పోయారు. హృదయాన్ని కదిలించే ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఓ కుటుంబం కారులో మహారాష్ట్రలోని నాందేడ్‌ వద్ద ఉన్న ఓ దర్గా దర్శనానికి వెళ్లింది. తమ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో భోజనం చేసేందుకు ఆగారు. కంధర్ చెరువు వద్ద వాహనాన్ని నిలిపారు. ఈ క్రమంలో టిఫిన్ బాక్సును కడిగేందుకు ఒకరు చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన మిగతా కుటుంబ సభ్యులు నీటిలో పడిపోయిన వ్యక్తిని కాపాడేందుకు వెళ్లారు. తొలుత ఇద్దరు వ్యక్తులు నీటిలో దూకారు. 
 
వీరంతా మునిగిపోవడంతో చూసి ఒడ్డున ఉన్న వారిలో ఇద్దరు చెరువులోకి దూకారు. వారు కూడా నీటిలో మునిగిపోవడంతో మరో మరో వ్యక్తి అలా మొత్తం ఐదుగురు చెరువులోకి దిగారు. వారంతా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments