Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్టు దిగిన ఏక్‌నాథ్ షిండే.. బీజేపీ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

ఠాగూర్
బుధవారం, 27 నవంబరు 2024 (17:24 IST)
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతుంది. బీజేపీ శ్రేణులతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవర్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎంగా ఎంపిక చేయాలని కోరుతున్నారు. అయితే, శివసేన నేత, ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాత్రం సీఎం పదవికి కోసం పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఓ మెట్టు దిగారు. కొత్త సీఎం అభ్యర్థి ఎంపికలో బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడివుంటానని స్పష్టం చేశారు. 
 
కొత్త సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమన్నారుప. వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. మహాయుతికి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. తన దృష్టిలో సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని అన్నారు.
 
'మహాయుతికి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన మహారాష్ట్ర ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో తెల్లవార్లు పనిచేశా.. రోజుకు రెండు మూడు గంటలు మాత్రమే నిద్రపోయా. ఒక కార్యకర్తలా చెప్పులరిగేలా తిరిగా.. నా దృష్టిలో సీఎం అంటే కామన్‌ మ్యాన్‌. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను.. కష్టాలన్నీ తెలుసు. మహిళలు, రైతులు ఇలా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు తీసుకొచ్చాం. సీఎంగా ఎటువంటి అసంతృప్తి లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌ షాలు అండగా నిలిచారు. తాజా పరిణామాలపై వారితో ఫోన్‌లో మాట్లాడా. సీఎం ఎంపిక విషయంలో వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపాను' అని ఏక్‌నాథ్‌ శిందే పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments