Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు ఇంట్లో భోజనం.. రాత్రి బస..! ఫడ్నవిస్ ట్వీట్..!

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (11:19 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విదర్భలోని ఒక రైతు ఇంట్లో భోజనం చేసి, ఆ రాత్రి అక్కడే బస చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో నమోదు చేశారు. దేశంలో మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుల సమస్యలు తీరకపోవడంతో మరణాలు మాత్రం ఆగడలేదు.
 
దీంతో రైతుల మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నడుంకట్టారు. ఆయన రాష్ట్రంలోని మూడు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆ సమయంలో విదర్భలోని 'యవత్ మల్' జిల్లా పింప్రి బూటి గ్రామంలో ముందుగా చనిపోయిన రైతుల భార్యలతో సమావేశమై మాట్లాడారు. 
 
అనంతరం విష్ణుజీ రంగారవు దుమ్నే అనే స్థానిక రైతు ఇంట్లో భోజనం చేసి, ఆ రోజు రాత్రి అక్కడే సీఎం గడిపారని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదే విషయాన్ని ఫడ్నవిస్ ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేసి, రైతు ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను కూడా ఆయన పోస్టు చేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments