Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఉద్యోగులకు లాతూర్ జడ్పీ షాక్

Webdunia
ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (15:32 IST)
జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఉద్యోగులకు మహారాష్ట్రలోని లాతూర్‌ జడ్పీ ఛైర్మన్‌ షాక్‌ ఇచ్చారు. ఉద్యోగుల వేతనాల్లోంచి 30 శాతం కోత విధించారు. వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను పట్టించుకోని ఏడుగురు జిల్లా పరిషత్‌ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించినట్టు జడ్పీ ఛైర్మన్‌ రాహుల్‌ బోంద్రే వెల్లడించారు. 
 
తమకు వచ్చిన 12 ఫిర్యాదుల్లో ఆరుగురు ఉపాధ్యాయులే ఉన్నారని ఆయన తెలిపారు. కోత విధించిన మొత్తాన్ని వారి తల్లిదండ్రుల ఖాతాల్లోకే బదిలీ చేసినట్టు చెప్పారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలన్న ప్రతిపాదనను గతేడాది నవంబర్‌లో జడ్పీ జనరల్‌ బాడీ ఆమోదించగా.. డిసెంబర్‌ నుంచి నెల జీతంలో కోత ప్రారంభమైందని ఆయన వివరించారు. 
 
ప్రతి నెలా వారి వేతనంలో 30శాతం కోత కొనసాగుతుందని, సగటున ఇది రూ.15 వేలు దాకా ఉంటుందని తెలిపారు. తాము నోటీసులు పంపిన తర్వాత కొన్ని కేసుల్లో ఉద్యోగులు, వారి తల్లిదండ్రులు పరస్పరం సమస్యను పరిష్కరించుకున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments