Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాసిక్ - షిర్డీ జాతీయ రహదారిపై ప్రమాదం.. పది మంది మృతి

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (11:53 IST)
మహారాష్ట్రలో నాసిక్ - షిర్డీ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మృత్యువాతపడ్డారు. రోడ్డుపై వెళుతున్న ఓ ట్రక్కును ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. 
 
గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరిలంచారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. థానే, ఉల్లాస్ నగర్, అంబేర్‌నాథ్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు బస్సులో షిర్డీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. 
 
ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, ప్రమాదంపై ఆయన దర్యాప్తునకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments