Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు కొత్త చిచ్చు : తెరపైకి రెండో రాజధాని!

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (14:33 IST)
తమిళనాడు రాష్ట్రంలో కొత్త చిచ్చు రేగింది. తెరపైకి రెండో రాజధాని అంశం వచ్చింది. అధికార అన్నాడీఎంకేకు చెందిన ఇద్దరు మంత్రులే ఈ అంశాన్ని రేపారు. చెన్నై నగరంలో జనాభాతో పాటు.. పారిశ్రామికరంగం కూడా బాగా అభివృద్ధి చెందిందని, అందువల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న మదురైను రెండో రాజధానిగా చేయాలని రాష్ట్ర మంత్రులు ఆర్.బి. ఉదయ్ కుమార్, సెల్లూరు రాజులు డిమాండ్ చేస్తున్నారు. పైగా, ఈ ప్రతిపాదన తమది కాదనీ, గతంలో తమ పార్టీ వ్యవస్థాపకుడైన స్వర్గీయ డాక్టర్ ఎంజీ రామచంద్రన్‌ అప్పట్లోనే ప్రతిపాదించారని, దాన్ని డీఎంకే అధినేత ఎం కరుణానిధి అడ్డుకున్నారని వారు సెలవిస్తున్నారు. 
 
తాజాగా మదురైలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర  మంత్రి సెల్లూరు రాజు పాల్గొని మాట్లాడుతూ, మదురై నగరంలోనే ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టాయని, అప్పట్లో మహాసభలు కూడా ఇక్కడే జరిగేవని అన్నారు. ఎంజీఆర్ హయాంలో ప్రపంచ తమిళ మహా సభలు కూడా ఇక్కడ జరిగాయని చెప్పారు. దివంగత సీఎం జయలలిత సైతం ఎన్నో కీలకమైన నిర్ణయాలను మదురైలోనే ప్రకటించారని చెప్పారు. తక్షణమే సీఎం స్పందించి, రెండో రాజధాని ఏర్పాటుపై ఓ కమిటీని వేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఇకపోతే, సోమవారం ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రెవెన్యూ మంత్రి ఉదయ్ కుమార్, చెన్నై విస్తరణను ప్రస్తావిస్తూ, రోజురోజుకూ జనాభా పెరుగుతోందని, నగరం చుట్టూ పరిశ్రమలు ఏర్పడ్డాయని, ఈ పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలకూ దాదాపు సమానదూరంలో ఉండే మధురైని రెండో రాజధానిగా చేయడం మినహా మరో మార్గం లేదని అన్నారు. సెకండ్ క్యాపిటల్ సాధ్యాసాధ్యాలను పరిశీలించే కమిటీ ఏర్పాటుకు పళనిస్వామి చర్యలు చేపట్టాలని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments