Webdunia - Bharat's app for daily news and videos

Install App

రమ్మీ పేకాటను ప్రోత్సహిస్తున్న కోహ్లీ - తమన్నా- రానా??

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (17:24 IST)
ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ ఎక్కువైంది. అంటే ఆన్‌లైన్ జూదం. ముఖ్యంగా ఆన్‌లైన్ రమ్మీకి ఎంతో మంది బానిసలుగా మారిపోతున్నారు. ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఇలాంటి గ్యాంబ్లింగ్‌కు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ హీరోయిన్ తమన్నా, హీరో దగ్గుబాటి రానా, నటులు ప్రకాష్ రాజ్, సుదీప్‌ తదితరులు ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో దీన్ని నిషేధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలను సంధించింది. ఆన్‌లైన్ జూదానికి సంబంధించిన డబ్బు ఎక్కడకు పోతుందని ప్రశ్నించింది. తెలంగాణలో ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించిన విషయాన్ని గుర్తు చేసిన మద్రాస్ హైకోర్టు బెంచ్... తమిళనాడులో అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? అని అడిగింది. 
 
ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ నిషేధంపై పది రోజుల్లో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. అదేసమయంలో దీనికి ప్రచారకర్తలుగా ఉన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ ప్రముఖులు రానా, ప్రకాశ్ రాజ్, తమన్నా, సుదీప్‌లకు నోటీసులు ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments