Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు భారతరత్న... తోసిపుచ్చిన మద్రాస్ హైకోర్టు... ఇక లేనట్టేనా?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనీ, ఆ ప్రకారంగా కేంద్రాన్ని ఆదేశించాలంటూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీనితో ఇక జయలలితకు భారతరత్న అవార్డు వచ్చే అవకాశం వుందో లేదో సస్పెన్సులో పడిపోయింది.

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (14:15 IST)
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనీ, ఆ ప్రకారంగా కేంద్రాన్ని ఆదేశించాలంటూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీనితో ఇక జయలలితకు భారతరత్న అవార్డు వచ్చే అవకాశం వుందో లేదో సస్పెన్సులో పడిపోయింది. 
 
కాగా మాజీ సీఎం జయలలితకు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని, జయ కాంస్య విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్ఠించాలని కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు మంత్రిమండలి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. జయ మరణానంతరం సీఎం బాధ్యతలు చేపట్టిన ఒ.పన్నీర్‌ సెల్వం ఈ మేరకు తీర్మానం చేశారు.
 
అదేవిధంగా జయలలిత పార్ధివదేహాన్ని ఖననం చేసిన ప్రాంతంలో రూ.15 కోట్లతో స్మారక మందిరం నిర్మించాలని, రాష్ట్ర అసెంబ్లీలో చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని, భారతరత్న డాక్టర్‌ ఎంజీఆర్‌ సమాధి పేరును ''భారతరత్న డాక్టర్‌ పురచ్చితలైవర్‌ ఎంజీఆర్‌''గా మార్చడంతో పాటు జయ సమాధికి ‘పురచ్చితలైవి అమ్మ సెల్వి జె.జయలలిత స్మారక మందిరం’గా పేరు పెట్టాలని మంత్రివర్గం తీర్మానించింది. రాష్ట్ర పరిధిలో అంశాలు ప్రక్కనపెడితే, కేంద్ర స్థాయిలో చేయాల్సినవి జరుగుతాయా అనేదే అనుమానం.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments