Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు భారతరత్న... తోసిపుచ్చిన మద్రాస్ హైకోర్టు... ఇక లేనట్టేనా?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనీ, ఆ ప్రకారంగా కేంద్రాన్ని ఆదేశించాలంటూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీనితో ఇక జయలలితకు భారతరత్న అవార్డు వచ్చే అవకాశం వుందో లేదో సస్పెన్సులో పడిపోయింది.

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2017 (14:15 IST)
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనీ, ఆ ప్రకారంగా కేంద్రాన్ని ఆదేశించాలంటూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీనితో ఇక జయలలితకు భారతరత్న అవార్డు వచ్చే అవకాశం వుందో లేదో సస్పెన్సులో పడిపోయింది. 
 
కాగా మాజీ సీఎం జయలలితకు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని, జయ కాంస్య విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్ఠించాలని కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు మంత్రిమండలి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. జయ మరణానంతరం సీఎం బాధ్యతలు చేపట్టిన ఒ.పన్నీర్‌ సెల్వం ఈ మేరకు తీర్మానం చేశారు.
 
అదేవిధంగా జయలలిత పార్ధివదేహాన్ని ఖననం చేసిన ప్రాంతంలో రూ.15 కోట్లతో స్మారక మందిరం నిర్మించాలని, రాష్ట్ర అసెంబ్లీలో చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని, భారతరత్న డాక్టర్‌ ఎంజీఆర్‌ సమాధి పేరును ''భారతరత్న డాక్టర్‌ పురచ్చితలైవర్‌ ఎంజీఆర్‌''గా మార్చడంతో పాటు జయ సమాధికి ‘పురచ్చితలైవి అమ్మ సెల్వి జె.జయలలిత స్మారక మందిరం’గా పేరు పెట్టాలని మంత్రివర్గం తీర్మానించింది. రాష్ట్ర పరిధిలో అంశాలు ప్రక్కనపెడితే, కేంద్ర స్థాయిలో చేయాల్సినవి జరుగుతాయా అనేదే అనుమానం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments