Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు... రైతులందరికీ రుణ మాఫీ చేయండి

మద్రాసు హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ఐదు ఎకరాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (16:32 IST)
మద్రాసు హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ఐదు ఎకరాలు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అయితే రుణమాఫీని రైతులందరికీ వర్తింపజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాలు ఆ రాష్ట్ర రైతులకు ఎంతో ఊరట కలిగించేలా ఉన్నాయి.
 
తమిళనాడు రాష్ట్ర చరిత్రలో గత 148 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. సుప్రీంకోర్టు ఆదేశాలను కర్నాటక ప్రభుత్వం ధిక్కరించి, కావేరీ జలాలను విడుదల చేయడం లేదు. ఒకవేళ విడుదల చేసినా అవి పంటల సాగుకు సరిపోవడం లేదు. దీంతో పంటనష్టం విపరీతంగా పెరిగింది. సరైన పంట లేకపోవడంతో బ్యాంకుల తీసుకున్న రుణాలు చెల్లించలేకపోతున్నారు. 
 
దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలంటూ దాదాపు 150 మంది తమిళ రైతులు గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. కపాలాలు, ఎలుకలతో నిరసన వ్యక్తంచేశారు. అప్పుల బాధతో సగటున రోజుకు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని రైతులు వాపోయారు. తమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments