భోపాల్‌లో దారుణం ... 55 యేళ్ల మహిళపై అత్యాచారం

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (13:29 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. 55 యేళ్ళ మహిళపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి తెగబడ్డారు. ఆ తర్వాత ఆమెను కర్రలతో చితకబాదారు. ఈ దారుణం గత నెలె 31వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని భింద్‌కు చెందిన 55 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి జీవిస్తోంది. అయితే, మరో ప్రాంతంలో విద్యాభ్యాసం చేస్తున్న కుమార్తెను చూసేందుకు భర్త గత నెల 30వ తేదీన వెళ్లాడు. దీంతో ఆ మహిళ ఒక్కటే ఇంట్లో ఉంది. 
 
ఇదే అదునుగా భావించిన పొరిగింటి వ్యక్తులైన బ్రిజేందర్‌, సూరజ్‌లు.. ఆమెను బలవంతంగా తమ ఇంట్లోకి లాక్కొచ్చారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించారు. అంతటితో ఆగకుండా కర్రలతో ఆమెను చితకబాదారు. 
 
ఈ క్రమంలో భర్త సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు విషయం చెప్పి బోరున విలపించింది. అనంతరం ఇద్దరు దంపతులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రిజేందర్‌, సూరజ్‌లు పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments