Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరబ్బాయిలతో ఇద్దరమ్మాయిల ప్రేమకథ : తండ్రికి తెలిసి ఆత్మహత్య

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (13:54 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సియోని జిల్లాలో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు అదే గ్రామానికి చెందిన ఇద్దరు అబ్బాయిలతో ప్రేమలోపడ్డారు. ఈ ప్రేమ వ్యవహారం అమ్మాయిల తండ్రికి తెలిసింది. దీంతో ఆ ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌ సియోని జిల్లాలోని కొంద్రా గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ఒకరి వయసు 18.. మరొకరి వయసు 16. వారిద్దరు ఇద్దరు యువకులతో ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. వారిలో ఒకమ్మాయి ప్రేమికుడు ఆమె తండ్రికి తాజాగా ఓ మెసేజ్‌ పంపి, తాను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. 
 
దీంతో తమ కూతుళ్ల ప్రేమ వ్యవహారం గురించి ఆ తండ్రికి తెలిసిపోయింది.. వారిద్దరిని పెద్దలు మందలించారు. తాము అబ్బాయిలను ప్రేమిస్తున్న విషయం ఇంట్లో తెలిసిపోవడంతో ఆ అక్కాచెల్లెళ్లిద్దరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని, ఓ బావి వద్దకు వెళ్లి అందులో దూకారు. 
 
బావిలో వారు దూకిన విషయాన్ని తెలుసుకున్న ఆ అక్కాచెల్లెళ్ల కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి, మృతదేహాలను బావిలోంచి బయటకు తీశారు. అమ్మాయి తండ్రికి మేసేజ్‌ పంపిన ప్రేమికుడి‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ అక్కాచెల్లెళ్ల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకున్నామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments