Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినులను హిజాబ్ ధరించాలని బలవంతం చేశారా?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (12:41 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులను హిజాబ్ ధరించాలని బలవంతం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేటు పాఠశాల బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులైన తమ స్కూలు టాపర్లతో కూడిన ఒక ఫ్లెక్సీని విడుదల చేసింది. అందులోని ముస్లింలు కానీ అమ్మాయిలు కూడా స్కార్ప్స్ ధరించి కనిపించారు. దీంతో పాఠశాలలో బాలికలందరినీ హిజాబ్ ధరించమని స్కూలు యాజమాన్యం ఒత్తిడి చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పోస్టర్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ పోస్టర్‌పై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ ప్రియాంక కనూంగో దామోహ్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మే 30వ తేదీన తమకు ఎన్.సి.పి.సి.ఆర్. ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. దామోహ్ జిల్లా విద్యాశాఖాధికారి విద్యార్థుల కుటుంబాలను కలిశారని తెలిపారు. అయితే, ఈ వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. 
 
మరోవైపు, ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్టు మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు. ఇప్పటికే మేం ఈ విషయంపై లోతైన విచారణ కోసం దామోహ్ జిల్లా పోలీసు ఎస్పీని ఆదేశించినట్టు మిశ్రా వెల్లడించారు. అలాగే, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ అంశంపై దృష్టిసారించి నివేదిక కోరినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments