Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేయబోతే ప్రతిఘటించింది.. అంతే కిరోసిన్ పోసి నిప్పంటించాడు..

మధ్యప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. అత్యాచారానికి ప్రతిఘటించిన కారణంతో ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సుస్తానీ గ్రామంలో బాధితురాల

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (18:21 IST)
మధ్యప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. అత్యాచారానికి ప్రతిఘటించిన కారణంతో ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సుస్తానీ గ్రామంలో బాధితురాలు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. 
 
ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై కన్నేసిన కామాంధుడు ఆమెపై తొలుత అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే మైనర్ బాలిక ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతిఘటించడంతో.. ఆమెను హతమార్చేందుకు పూనుకున్నాడు. 
 
ఆమె కేకలు వేయకుండా ఉండేందుకు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె మంటల్లో చిక్కుకోగానే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 50 శాతం కాలిపోయిందని వైద్యులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న నిందితుడి కోసం దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments