Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసుల ఎదుటే ఉరేసుకున్న యువకుడు.. ఎందుకు?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:20 IST)
గొర్రెల చోరీలో నిందుతుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్న ఒక యువకుడు వారి సమక్షంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చూరూ జిల్లాలోని రతన్‌గఢ్ పోలీసుల పరిధిలో జరిగింది. ఇటీవల పోలీస్ స్టేషన్‌లో గొర్రెల చోరీపై కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు మూడు రోజుల క్రితం రతన్‌ఘడ్‌కు చెందిన దినేష్ కుమారుడు భగవతీ ప్రసాద్‌ను విచారించేందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. 
 
మూడురోజులుగా అక్కడే ఉంచి అతడిని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడు టాయిలెట్‌కి వెళ్లాలని పోలీసులకు చెప్పాడు. అతనిపై నిఘా ఉంచేందుకు ఒక పోలీసును వెంట పంపించారు. లోపలికి వెళ్లిన నిందితుడు అక్కడే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతరం ఆ యువకుని కుటుంబసభ్యులు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments