Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న మూత్రం పోశారు.. ఇపుడు పాదాలు నాకించారు.. ఎంపీలో అమానవీయ ఘటనలు

Webdunia
ఆదివారం, 9 జులై 2023 (11:27 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పాలనలో అమానవీయ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికిమొన్న ఓ గిరిజన తెగకు చెందిన వ్యక్తితో బీజేపీ ప్రతినిధి ఒకరు మూత్ర విసర్జనకు పాల్పడ్డారు. ఈ ఘటన మరువక ముందే జరిగిన మరో ఘటన ప్రభుత్వంపై విమర్శలకు కారణమవుతోంది. 
 
ఓ యువకుడిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిన వ్యక్తులు అందులోనే అతడితో 17 ఏళ్ల కుర్రాడి పాదాలు నాకించి వికృత చేష్టలకు దిగారు. అంతకుముందు చెప్పులతో చితకబాదారు. కారులోనే ఉన్న మరో వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ అయింది.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడు, నిందితులు గ్వాలియర్ జిల్లాలోని డబరా ప్రాంతానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments