Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ పాలనలో బీజేపీ అభ్యర్థికి చెప్పుల దండతో సత్కారం (వీడియో)

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆ పార్టీ అభ్యర్థికి స్థానిక ఓటర్లు తగిన రీతిలో గుణపాఠం నేర్పారు. ఇచ్చిన హామీని నెరవేర్చనందుకు ప్రతిగా మెడలో చెప్పుల దండ వేసి సత

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (10:36 IST)
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆ పార్టీ అభ్యర్థికి స్థానిక ఓటర్లు తగిన రీతిలో గుణపాఠం నేర్పారు. ఇచ్చిన హామీని నెరవేర్చనందుకు ప్రతిగా మెడలో చెప్పుల దండ వేసి సత్కారం చేశారు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ సర్కారు అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఉన్నారు. ఈ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం కోసం దినేశ్ శర్మ అనే అభ్యర్థి మధ్యథామ్ నోడ్ అనే ప్రాంతానికి ప్రచారానికి వెళ్లాడు. 
 
ఇంటింటి ప్రచారానికి వెళ్లి ఓట్లు అడుగుతుంటే, ఓ వ్యక్తి వచ్చి చెప్పుల దండను ఆయన మెడలో వేశాడు. దీంతో హుషారుగా ప్రచారం నిర్వహిస్తున్న ఆయన షాక్‌కు గురై, ఆ వెంటనే తేరుకున్నాడు. తొలుత చెప్పులను పక్కకు పడేసేందుకు ప్రయత్నించిన శర్మ, ఆ వ్యక్తి తన ప్రయత్నాన్ని మానకపోవడంతో దండ వేయించుకోవాల్సి వచ్చింది. 
 
తమ ప్రాంతంలోని తాగునీటి సమస్య అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం కలగలేదని, అందుకే ఈ పని చేశానని చెప్పుల దండను తెచ్చిన వ్యక్తి వ్యాఖ్యానించాడు.
 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో హేమ పట్టుబడింది, ఆ వీడియో సంగతి తేలుస్తాం: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments