Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 1.5 లక్షల ఐఫోన్.. క్యాష్ ఆన్ డెలీవరీ కోసం వెళ్లిన డెలివరీ బాయ్ ఏమయ్యాడు?

సెల్వి
మంగళవారం, 1 అక్టోబరు 2024 (10:44 IST)
రూ. 1.5 లక్షలు చెల్లించాల్సిన కస్టమర్‌కు ఐఫోన్ డెలివరీ చేయడానికి వెళ్లిన 30 ఏళ్ల డెలివరీ మ్యాన్ హత్యకు గురైయ్యాడు. వివరాల్లోకి వెళితే.. చిన్‌హాట్‌కు చెందిన గజానన్ ఫ్లిప్‌కార్ట్ నుండి సుమారు రూ. 1.5 లక్షల విలువైన ఐఫోన్‌ను ఆర్డర్ చేసి, క్యాష్ ఆన్ డెలివరీ చెల్లింపు ఎంపికను ఎంచుకున్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శశాంక్ సింగ్ తెలిపారు. 
 
సెప్టెంబర్ 23న, నిషాత్‌గంజ్‌కు చెందిన డెలివరీ బాయ్, భరత్ సాహు, గజానన్, అతని సహచరుడు ఫోన్ డెలివరీ చేయడానికి వెళ్ళాడు. అయితే ఆ డెలివరీ బాయ్‌ను ఆర్డర్ చేసిన వ్యక్తి హత్య చేశాజు.  సాహును గొంతు నులిమి చంపిన తరువాత, వారు అతని మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఇందిరా కెనాల్‌లో పడేశారు. 
 
సాహు రెండు రోజులుగా ఇంటికి తిరిగి రాకపోవడంతో, అతని కుటుంబం సెప్టెంబర్ 25న చిన్‌హట్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదును నమోదు చేసింది. సాహు కాల్ వివరాలను స్కాన్ చేసి, అతని లొకేషన్‌ను కనుగొనే ప్రయత్నంలో, పోలీసులు గజానన్ నంబర్‌ను కనుగొని అతని స్నేహితుడు ఆకాష్‌ను చేరుకోగలిగారు.
 
విచారణలో ఆకాష్ నేరం అంగీకరించాడని డీసీపీ అధికారి తెలిపారు. పోలీసులు ఇంకా మృతదేహాన్ని కనుగొనలేదు. "స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందం కాలువలో బాధితుడి మృతదేహాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తోంది" అని అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటుడు గోవిందా తుపాకీ మిస్‌ఫైర్ - ఆస్పత్రికి తరలింపు

రజనీకాంత్‌కు అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రిలో అడ్మిట్

గత జన్మలో చేసిన పాపాల వల్లే ఇదంతా.. అంతా బిగ్ బాస్ పబ్లిసిటీ కోసమా?

'దేవర' 3 రోజుల్లో రూ.304 కోట్లు? - నిజమేనా? సోషల్ మీడియాలో చర్చ!

జానీ మాస్టర్‌కు తప్పని చిక్కులు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

పంది కొవ్వు నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

తర్వాతి కథనం
Show comments