Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్జీ గేమ్ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపిన తనయుడు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (14:10 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పబ్జీ గేమ్ ఆడనివ్వలేదన్న కోపంతో కన్నతల్లిని తండ్రి రివాల్వర్‌తో కాల్చి చంపాడో తనయుడు. ఆ తర్వాత శవాన్ని మాయం చేసేందుకు తన స్నేహితుడి సాయం కోరడమే కాకుండా అతిని ఐదు వేల రూపాయలను ఆఫర్ కూడా చేశాడు. ఈ దారుణం ఐదు రోజుల క్రితం జరిగింది. 
 
యూపీలోని లక్నోకు చెందిన సాధన (40) అనే మహిళకు 16 యేళ్ల బాలుడు ఉన్నాడు. పజ్ జీ మొబైల్ గేమ్ ఆడకుండా అడ్డుకుంది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ బాలుడు.. తల్లిని కాల్చి చంపాడు. మూడు తర్వాత తర్వాత మృతదేహం నుంచి దుర్వాస రావడంతో కోల్‌కతాలో పని చేస్తున్న ఆర్మీ ఉద్యోగి అయిన తన తండ్రికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆ బాలుడు వద్ద విచారణ జరపగా పబ్జీ గేమ్ ఆడొద్దని చెప్పడంతోనే కాల్చి చంపినట్టు అంగీకరించాడు. తల్లి మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు తరలించేందుకు స్నేహితుడి సాయాన్ని కోరడమే కాకుండా  రూ.5 వేల నగదు కూడా ఆఫర్ చేశానని చెప్పాడు. పైగా, ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పొద్దని రివాల్వర్‌తో స్నేహితుడిని కూడా బెదిరించాడు. దీంతో ఈ హత్య జరిగిన ఐదు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments