Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వారంటైన్‌లోనే వివాహం.. ప్రేమికులు అలా ఒక్కటయ్యారు..

Webdunia
గురువారం, 28 మే 2020 (14:53 IST)
ఇద్దరు ప్రేమికులు క్వారంటైన్‌లోనే వివాహం చేసుకున్నారు. కరోనా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ పెళ్లి వేదికగా మారిపోయింది. ఈ వేదికలో ప్రేమికులిద్దరూ వివాహం చేసుకున్నారు. నిర్వాహకులుగా ఉన్న టీచర్లు, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లు పెళ్లి పెద్దలుగా మారిపోయారు. ఈ అరుదైన ఘటన ఒడిశా రాష్ట్రంలోని సాగాడ గ్రామంలో వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. సౌరబ్ దాస్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన పింకీరాణినితో ప్రేమలో పడ్డారు. ఇంట్లో చెప్పకుండా ఈ ఏడాది జనవరిలో అహ్మదాబాద్ నగరానికి పారిపోయారు.
 
అక్కడే ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో పనిచేస్తూ ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. లాక్ డౌన్ సమయంలో పరిశ్రమ మూసివేయడంతో ప్రేమికుల జంట ఎంతో కష్టనష్టాలు పడి సాగాడ గ్రామానికి తిరిగివచ్చింది. దీంతో వారిని అధికారులు క్వారంటైన్ చేశారు. 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నతర్వాత క్వారంటైన్ నిర్వాహకులే వారికి వివాహం చేశారు. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుడు, ఆశా కార్మికుడు, అంగన్ వాడీ వర్కర్లు ఈ ప్రేమ జంటను ఆశీర్వదించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments