Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపెడుతున్న కరోనా.. హిమాచల్ ప్రదేశ్‌లో లాక్డౌన్

Webdunia
బుధవారం, 5 మే 2021 (17:55 IST)
కరోనా వైరస్ రోజురోజుకూ భయపెడుతోంది. ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్యలో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఈ వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. దీంతో లక్డౌన్ విధించే రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం 10 రోజులపాటు లాక్డౌన్‌ విధించాలని బుధవారం నిర్ణయం తీసుకుంది.
 
ఈ లాక్డౌన్ ఈ నెల 7 నుంచి 16 వరకు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ అధ్యక్షత బుధవారం అత్యవసర కేబినేట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు మంత్రివర్గం లాక్‌డౌన్‌ అమలుకు ఆమోదముద్ర వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం పదోతరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ఇంటర్కు ప్రమోట్‌ చేసింది. బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణించాలనుకునే వారు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకొని నెగిటివ్‌ రిపోర్టు వెంట ఉంచుకోవాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments