Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపెడుతున్న కరోనా.. హిమాచల్ ప్రదేశ్‌లో లాక్డౌన్

Webdunia
బుధవారం, 5 మే 2021 (17:55 IST)
కరోనా వైరస్ రోజురోజుకూ భయపెడుతోంది. ప్రతి రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్యలో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ఈ వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. దీంతో లక్డౌన్ విధించే రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం 10 రోజులపాటు లాక్డౌన్‌ విధించాలని బుధవారం నిర్ణయం తీసుకుంది.
 
ఈ లాక్డౌన్ ఈ నెల 7 నుంచి 16 వరకు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ అధ్యక్షత బుధవారం అత్యవసర కేబినేట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు మంత్రివర్గం లాక్‌డౌన్‌ అమలుకు ఆమోదముద్ర వేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం పదోతరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను ఇంటర్కు ప్రమోట్‌ చేసింది. బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణించాలనుకునే వారు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకొని నెగిటివ్‌ రిపోర్టు వెంట ఉంచుకోవాలని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments