Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 యేళ్ళనాటి సమస్యకు పరిష్కారం చూపిన లాక్డౌన్!!

Webdunia
బుధవారం, 27 మే 2020 (09:19 IST)
దేశంలో వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోయింది. వీటిని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వాహన రాకపోకలపై అనేక రకాలైన ఆంక్షలు విధిస్తున్నారు. అలాగే, జల కాలుష్య నివారణకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఈ జల కాలుష్యం కారణంగా చెరువులు, నదులు, ఉప నదులు, ఇలా అన్నీ కలుషితమై పోతున్నాయి. ప్రధానంగా దేశానికి ప్రధాన జీవనాధారంగా ఉండే కీలక నదులు కూడా ఈ కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. గంగా, యమున వంటి పవిత్ర నదుల ప్రక్షాళన కోసం కేంద్రం నడుం బిగించింది. అయినప్పటికీ.. రవ్వంత కూడా పురోగతి లేదు. 
 
ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్డౌన్ చేస్తోంది. గత రెండు నెలలకు పైగా ఈ లాక్డౌన్ అమల్లో ఉండటంతో దేశం మొత్తం స్తంభించిపోయింది. దీంతో దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న జల కాలుష్య సమస్యకు చక్కటి పరిష్కారం లభించింది. 
 
తాజాగా 25 సంవత్సరాలుగా కలుషితమైపోయిన యమునా నది.. ఇపుడు స్వచ్ఛంగా మారింది. ఈ నదిలో నీరు ప్రహిస్తున్నప్పటికీ అడుగు భాగం స్పష్టంగా తెలుస్తోందంటే.. జల కాలుష్యం ఏమేరకు తగ్గిపోయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఒక్క యమునా నది మాత్రమే కాదు.. అనేక నీటి నిల్వ కేంద్రాలు కూడా స్వచ్ఛంగా మారిపోయాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments