Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లాక్ డౌన్-పుట్టినింట్లో భార్య.. ప్రియురాలి మెడలో తాళి కట్టేసిన భర్త

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (17:33 IST)
లాక్ డౌన్ కారణంగా మహిళలపై గృహ హింసలు పెరిగిపోతున్నాయని అధ్యయనాలు తేల్చిన నేపథ్యంలో.. లాక్ డౌన్‌ను సాకుగా కొందరు మగాళ్లు పిచ్చి పనులు చేస్తున్నారు. ఇప్పటికే భార్యకు దూరంగా ఉండలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. మందు లేకుండా ఉండలేమని మరికొందరు నానా హంగామా చేసిన ఉదంతాలున్నాయి. 
 
తాజాగా ఓ ప్రబుద్ధుడు భార్య మెట్టినింటికి రాలేదని.. తన ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా మెట్టినింటికి చేరుకోలేని భార్యపై కోపంతో మరో పెండ్లి చేసుకున్నాడు సదరు బీహార్ వ్యక్తి.
 
వివరాల్లోకి వెళితే.. పాట్నా పాలీగంజ్‌కు చెందిన ధీరజ్ కుమార్‌కు దుల్హిన్ బజార్‌కు చెందిన యువతితో ఇటీవలె పెండ్లయింది. కొన్నిరోజుల కిందటే ఆమె పుట్టింటికి వెళ్లగా, ఆపై లాక్ డౌన్ ప్రకటించారు. దాంతో ఆ యువతి పుట్టింట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. 
 
అయితే ధీరజ్ కుమార్ అసహనానికి లోనై, భార్యను వెంటనే వచ్చేయాలని అనేకమార్లు ఫోన్ చేశాడు. రాకపోవడంతో మరింత అసంతృప్తికి గురైన ధీరజ్ మాజీ ప్రియురాలి మెళ్లో తాళికట్టేశాడు. దాంతో దిగ్భ్రాంతికి గురైన మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments