Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ రిజల్ట్స్ : నితీశ్‌కు నరేంద్ర మోడీ - చంద్రబాబు - సిద్ధరామయ్య అభినందనలు

Webdunia
ఆదివారం, 8 నవంబరు 2015 (14:01 IST)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు నితీశ్‌కు ఫోన్లు చేసిమరీ తమ అభినందనలు తెలిపారు. 
 
ఆదివారం వెల్లడైన బీహార్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి భారీ ఆధిక్యంతో ఉండటాన్ని గమనించిన నరేంద్ర మోడీ.. నితీశ్‌కు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపాు. మూడోసారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నందుకు నితీశ్ కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
 
అలాగే, బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్న సీఎం నితీశ్ కుమార్‌కు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నితీశ్‌కు ఫోన్ చేసిన చంద్రబాబు ఎన్నికల్లో విజయం పట్ల ఆయనకు అభినందనలు తెలిపారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. బీహార్‌లో మహా కూటమి విజయం అభివృద్ధికి ప్రజలు కట్టబెట్టిన విజయమని వ్యాఖ్యానించారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments