Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో కిక్కుకి పరాకాష్ట - లిక్కరు బిల్లు రూ.95,347

Webdunia
మంగళవారం, 5 మే 2020 (16:55 IST)
కిక్కు పరాకాష్టకు చేరింది. దీనికి నిదర్శనమే ఓ లిక్కరు బిల్లు ఏకంగా రూ.95347, మరో లిక్కరు బిల్లు రూ.52,841. ఈ రెండు బిల్లులు ఇపుడు నెట్టింట వైరల్ అయ్యాయి. పైగా, ఈ విషయం పోలీసుల దృష్టికి చేరింది. దీంతో ఒకే వ్యక్తికి అధిక మొత్తంలో మద్యం విక్రయించినందుకుగాను వైన్ షాపుపై అబ్కారీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, కేంద్రం ఇచ్చిన సడలింపులతో దేశవ్యాప్తంగా 46 రోజుల తర్వాత మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దీంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కొందరు వేలాది రూపాయలకు మందును కొనుగోలు చేస్తున్నారు. 
 
బెంగుళూరులో వెనిల్లా స్పిరిట్ అనే వైన్ షాపు ఓ వ్యక్తి ఏకంగా రూ.52841 విలువ చేసే మద్యాన్ని కొనుగోలుచేశారు. ఈ తాగుబోతు తానేదో ఘనకార్యం చేసినట్టుగా ఆ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. 
 
అలాగే, బెంగుళూరుకు చెందిన మరో వ్యక్తి రూ.95347కు మద్యం కొనుగోలు చేసి రికార్డు బ్రేక్ చేశాడు. ఈ రెండు ఘటనల వ్యవహారం ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments