కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

ఠాగూర్
ఆదివారం, 25 మే 2025 (17:39 IST)
కేరళ సముద్రతీరంలో లైబీరియా దేశానికి చెందిన కార్గో నౌక ఒకటి నీట మునిగిపోయింది. కొచ్చి తీరానికి సుమారు 38 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఎస్సీ ఎల్సా-3 అనే పేరు గల ఈ 184 మీటర్ల పొడవైన నౌక తొలుత ఒక వైపునకు ఒరిగిపోయింది. ఈ ఘటనతో సముద్ర జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత తీర రక్షక దళం (ఐసీజీ) ఈ విషయాన్ని ధృవీకరించింది. ప్రమాద సమయంలో నౌకలో ఉన్న సిబ్బందిని సురక్షితంగా కాపాడారు.
 
నౌక సముద్రంలో మునిగిపోయే సమయంలో కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. తాజాగా, నౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోయిందని ఐసీజీ అధికారులు వెల్లడించారు. ఈ నౌకలో మొత్తం 640 కంటైనర్లు ఉన్నాయని, వీటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. మరో 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్ ఉందని, మిగిలిన వాటితో పాటు నౌకలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ రసాయనాలు, ఇంధనం సముద్రంలో కలిస్తే తీవ్ర పర్యావరణ నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో కొచ్చి తీరంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
 
సముద్రంలో తేలియాడుతున్న కంటైనర్లు గానీ, బయటకు వచ్చిన ఇంధనం గానీ తీరం వైపు కొట్టుకువస్తే వాటిని తాకవద్దని 'విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది. సముద్ర జలాల్లో ఇంధనం ఎంతమేరకు వ్యాపించిందో తెలుసుకోవడానికి 'ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీ'ని ఉపయోగిస్తున్న విమానం నిరంతరం గగనతలంలో పర్యవేక్షిస్తోందని అధికారులు వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments