Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేసిన కష్టాలు... అమూల్యకు తండ్రి షాక్

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (13:01 IST)
జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా బెంగళూరులో నిర్వహించిన 'సేవ్ కాన్‌స్టిట్యూషన్' కార్యక్రమంలో అమూల్య అనే యువతి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది. ఈ యువతిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఇపుడు ఆమె తండ్రి కూడా తేరుకోలేని షాకిచ్చారు. 
 
ఇలాంటి కుమార్తెను కన్నందుకు సిగ్గుపడుతున్నట్టు చెప్పారు. పైగా, ఆమె కోసం తాను ఎలాంటి న్యాయపోరాటం చేయబోనని తేల్చి చెప్పారు. తన మాతృదేశం భారత్ అని, పాకిస్థాన్ అనుకూల శక్తులు ఇక్కడ మనుగడసాగించజాలవన్నారు. 
 
కాగా, గురువారం జరిగిన ఈ సభలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ బెంగుళూరుకు చెందిన అమూల్య అనే యువతి నినాదాలు చేసింది. ఈ నినాదాలు కలకలం రేపాయి. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగించిన తర్వాత వేదిక ఎక్కి మైక్ వద్దకు వచ్చిన అమూల్య అనే యువతి 'పాకిస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేసింది.
 
వెంటనే అప్రమత్తమైన ఒవైసీ.. ఆమె వద్దకు వచ్చి మైక్ లాక్కుకుని పక్కకు తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమూల్య వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆమెకు ఈ కార్యక్రమానికి సంబంధం లేదని, కార్యక్రమ నిర్వాహకులు ఆమెను ఆహ్వానించలేదని వివరణ ఇచ్చారు. తాము ఎప్పటికీ పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వబోమని, భారత్‌తోనే ఉంటామని ఒవైసీ స్పష్టం చేశారు. ఇపుడు ఆ యువతి తండ్రి కూడా షాకిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments