Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలలో చిరుతపులి.. క్లాస్ రూమ్‌లోనే విద్యార్థులు, టీచర్లు.. 4 గంటల పాటు...

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2015 (13:11 IST)
చిరుతపులి పాఠశాలలో కనిపించి విద్యార్థులను, ఉపాధ్యాయులను హడలెత్తించింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. పులి భయంతో నాలుగు గంటల పాటు విద్యార్థులు, టీచర్లు క్లాస్ రూమ్ లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు.

ఉనా జిల్లాలోని గిర్ అభయారణ్యంకు సమీపంలో ఉన్న పాల్డీ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోకి మంగళవారం చిరుతపులి ప్రవేశించడంతో విద్యార్థులు, టీచర్లు క్లాస్ రూమ్ లోకి పరుగులు తీశారు. 40 మంది విద్యార్థులు, టీచర్లు నాలుగు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.

మంగళవారం ఉదయం అసెంబ్లీ ముగిసిన తర్వాత మెట్ల కింద పిల్లి లాంటి జంతువు ఉందని టీచర్లకు విద్యార్థులు తెలిపారు. చిరుతపులిగా గుర్తించడంతో అందరూ జడుసుకున్నారు. తర్వాత అటవీ అధికారులు చిరుతను బంధించి సమీపంలోని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిరుతను తీసుకెళ్లిన తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments