Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కోసం నిప్పు... చివరికి ఏమైందంటే?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:35 IST)
భారతదేశంలో పులుల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతున్న తరుణంలో మహారాష్ట్రలో మరో 5 చిరుతపులి పిల్లలు సజీవదహనమయ్యాయి. అయితే ప్రమాదవశాత్తూ ఇవి చనిపోయాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని అంబేగామ్ తాలూకా గావడీవాడీ గ్రామంలో గోపినాథ్ గునాగే అనే వ్యక్తికి చెరకు తోట ఉంది.
 
అయితే చెరుకు కోసేందుకు నిన్న ఉదయం ఆరు గంటలకు కూలీలు వచ్చి కోత మొదలుపెట్టారు. ఆ సమయంలో వారికి ఒక అత్యంత విషపూరితమైన పాము కనిపించింది. ఆ పామును చంపేందుకు కూలీలు తోటకు నిప్పంటించారు.
 
మంటలు ఆరాక పాము కోసం వెతుకుతున్న సమయంలో వారికి 15 రోజుల వయసున్న చిరుతపులి పిల్లల కబేళాలు కనిపించాయి. పాము కోసం పెట్టిన మంటలో రెండు మగ మూడు ఆడ చిరుత పిల్లలు చనిపోయాయని గుర్తించారు. 
 
ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో వారు వచ్చి చిరుతపులి పిల్లల కళేబరాలకు పోస్ట్ మార్టం చేయించి వాటిని పూడ్చి పెట్టారు. పులి పిల్లలు సజీవదహనమైన నేపథ్యంలో ఆ పెద్ద పులి గ్రామ ప్రజలపై దాడిచేసే అవకాశముందని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments