Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురిపై దాడి చేసిన చిరుత: పట్టుకునేందుకు యత్నిస్తే చేయి కొరుకుతూ...(Video)

ఐవీఆర్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (10:47 IST)
శ్రీనగర్ లోని గండేర్‌బల్‌లో బుధవారం చిరుతపులి దాడిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు వన్యప్రాణి శాఖ అధికారులతో సహా ఐదుగురు గాయపడ్డారు. అయితే చిరుతపులిని అధికారులు సజీవంగా పట్టుకున్నారు. ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించి సంబంధిత శాఖకు సమాచారం అందించారు. దీంతో పెద్దఎత్తున వేట ప్రారంభించామని అధికారి తెలిపారు.
 
సెర్చ్ ఆపరేషన్‌లో చిరుతపులి దాడి చేయడంతో ఇద్దరు మహిళలు, ముగ్గురు వన్యప్రాణి అధికారులు గాయపడ్డారని అధికారి తెలిపారు. తీవ్ర ప్రయత్నాల అనంతరం వన్యప్రాణి అధికారులు చిరుతను సజీవంగా పట్టుకున్నారు. ఆ సమయంలో చిరుత వారిపై దూకుతూ దాడి చేసింది. ఐతే ఎంతో ధైర్యసాహసాలతో అటవీశాఖ సిబ్బంది చిరుతపై ఎలాంటి మారణాయుధాలు ఉపయోగంచకుండా దాని దాడిని ఎదుర్కొంటూ పట్టుకున్నారు.
 
చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని వైద్యాలయానికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments