Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ తలాక్ బిల్లు రూపకర్తల్లో ఒకరైన నారాయణ రాజు మృతి..

Webdunia
గురువారం, 6 మే 2021 (09:32 IST)
జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, సీఏఏ బిల్లుల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర న్యాయశాఖ (శాసన) కార్యదర్శి డాక్టర్ జి.నారాయణరాజు మృతి చెందారు. ఆయనకు కరోనా సోకడంతో కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. కొవిడ్ బారినపడి ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణరాజు పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.
 
నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చదువుకుని, తొలినాళ్లలో అక్కడే అధ్యాపకుడిగా పనిచేశారు. 2015లో న్యాయశాఖలో చేరిన నారాయణరాజు శాసన వ్యవహారాల కార్యదర్శిగా, జమ్మూకశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, సీఏఏ బిల్లుల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.
 
నారాయణరాజు రెండేళ్ల క్రితం రిటైరయ్యారు. అప్పటికి ఆయన కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ సభ్యుడిగా పనిచేస్తున్నారు. రిటైర్ అయినప్పటికీ ఆయన సమర్థతను గుర్తించిన కేంద్రం మరో రెండేళ్లపాటు నారాయణరాజు పదవీకాలాన్ని పొడిగించింది. ఆయన మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments