Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ మందిర నిర్మాణ భూమిపూజ చూసి పులకించిపోయిన లెజండ్రీ లాయర్

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (17:06 IST)
అయోధ్యపురిలో రామ మందిర నిర్మాణం కోసం బుధవారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమాన్ని టీవీల ముందు కూర్చొని తిలకించిన ప్రతి హిందూ భారతీయుడు పులకించిపోయారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించిన కోట్లాది మంది భారతీయుల్లో సీనియర్ న్యాయవాది పరాశరన్ ఒకరు. 
 
ఈయన తన కుటుంబ సభ్యులతో కలిసి భూమిపూజ కార్యక్రమాన్ని ఉద్వేగభరితులై చూస్తున్న క్షణాలను ఇలా కెమెరాలలో బంధించారు. అయోధ్య కోసం అవిశ్రాంతంగా పరాశరన్ న్యాయపోరాటం చేశారు. సుప్రీంకోర్టులో కేసు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే అయోధ్య కేసులో కె. పరాశరన్ పేరును ప్రధానంగా ప్రస్తావిస్తారు. 
 
ఇకపోతే, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ భూమిపూజ మహోత్సవ ఘట్టాన్ని అతికొద్ది మంది ఆహ్వానితుల మధ్యే నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ శాఖలు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశాయి. ఫలితంగా కోట్లాదిమంది భారతీయులు చరిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో వీక్షించి పులకించిపోయారు. 
 
అలా వీక్షించిన రాజకీయ అగ్రనేతల్లో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుప్రీంలో అయోధ్యపై వాదించిన సీనియర్ న్యాయవాది కె. పరాశరన్ తమ నివాసాల నుంచి టీవీలలో భూమి పూజ కార్యక్రమాన్ని చూశారు. వాటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments