Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ మందిర నిర్మాణ భూమిపూజ చూసి పులకించిపోయిన లెజండ్రీ లాయర్

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (17:06 IST)
అయోధ్యపురిలో రామ మందిర నిర్మాణం కోసం బుధవారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమాన్ని టీవీల ముందు కూర్చొని తిలకించిన ప్రతి హిందూ భారతీయుడు పులకించిపోయారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించిన కోట్లాది మంది భారతీయుల్లో సీనియర్ న్యాయవాది పరాశరన్ ఒకరు. 
 
ఈయన తన కుటుంబ సభ్యులతో కలిసి భూమిపూజ కార్యక్రమాన్ని ఉద్వేగభరితులై చూస్తున్న క్షణాలను ఇలా కెమెరాలలో బంధించారు. అయోధ్య కోసం అవిశ్రాంతంగా పరాశరన్ న్యాయపోరాటం చేశారు. సుప్రీంకోర్టులో కేసు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే అయోధ్య కేసులో కె. పరాశరన్ పేరును ప్రధానంగా ప్రస్తావిస్తారు. 
 
ఇకపోతే, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ భూమిపూజ మహోత్సవ ఘట్టాన్ని అతికొద్ది మంది ఆహ్వానితుల మధ్యే నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ శాఖలు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశాయి. ఫలితంగా కోట్లాదిమంది భారతీయులు చరిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో వీక్షించి పులకించిపోయారు. 
 
అలా వీక్షించిన రాజకీయ అగ్రనేతల్లో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుప్రీంలో అయోధ్యపై వాదించిన సీనియర్ న్యాయవాది కె. పరాశరన్ తమ నివాసాల నుంచి టీవీలలో భూమి పూజ కార్యక్రమాన్ని చూశారు. వాటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.


 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments