Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను హతమార్చాడు.. తలను వేరు చేసి ఊరంతా ఊరేగించాడు.. ఆలయ తలుపుల వద్ద?

భార్యపై అనుమానంతో ఆ భర్త కిరాతకంగా వ్యవహరించాడు. అనుమానంతో భార్యను వేధించడమే కాకుండా.. ఆమెను దారుణంగా హతమార్చి.. తలను వేరు చేసి.. ఊరంతా ఊరేగించాడు. ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతి చెందారు. పోలీసులకు సమ

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (14:00 IST)
భార్యపై అనుమానంతో ఆ భర్త కిరాతకంగా వ్యవహరించాడు. అనుమానంతో భార్యను వేధించడమే కాకుండా.. ఆమెను దారుణంగా హతమార్చి.. తలను వేరు చేసి.. ఊరంతా ఊరేగించాడు. ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతి చెందారు. పోలీసులకు సమాచారం అందించారు. ఈ దుర్ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వెళ్లాలన్‌కుళం గ్రామానికి చెందిన ముత్తురాజ్‌(47)కు భార్య కాంచన అలియాస్‌ జమున(45), ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో భార్యపై అనుమానం పెంచుకున్న ముత్తురాజ్ ఆమెతో గొడవకు దిగేవాడు. కొట్టేవాడు. నానా హింసలు పెట్టేవాడు. అయినా ఆమె సహించింది. కానీ ముత్తురాజ్ మాత్రం తనలోని అనుమాన భూతానికి పనిచెప్పాడు. ఫూటుగా మందేసి ఇంట్లో పిల్లలెవరూ లేని సమయాన్ని చూసి ముత్తురాజ్‌ తన భార్య కత్తితో హతమార్చాడు.

అక్కడితో ఆగకుండా తలను వేరు చేసి వీధులలో ఊరేగించి, ఆలయ తలుపుల వద్ద పెట్టాడు. ఈ ఘటనను చూసిన గ్రామస్థులు షాక్ తిన్నారు. స్థానికుల సమాచారంతో ముత్తురాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని కోర్టు ముందు హాజరు పరిచి.. జైలుకు తరలించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

OTT: ఓటీటీ వచ్చాక థియేటర్లు చనిపోయాయి : నిర్మాత గణపతి రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments