Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నోర్మూసుకోండి (షటప్‌).. లేదంటే బయటికి గెంటివేయిస్తా’.. ఇదేమైనా చేపల మార్కెట్టా : చీఫ్ జస్టీస్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోర్టుల్లో న్యాయవాదులు వాదనలు మాత్రమే వినిపించాలి. గట్టిగా వాదులాడుకోకూడదు. ఇది ప్రాథమిక సూత్రం. కానీ... సాక్షాత్తూ సుప్రీంకో

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (09:38 IST)
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్‌కు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోర్టుల్లో న్యాయవాదులు వాదనలు మాత్రమే వినిపించాలి. గట్టిగా వాదులాడుకోకూడదు. ఇది ప్రాథమిక సూత్రం. కానీ... సాక్షాత్తూ సుప్రీంకోర్టులో, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ ముందే ఇద్దరు లాయర్లు గట్టిగా అరుచుకున్నారు. దీంతో... జస్టిస్‌ ఠాకూర్‌కు సహనం నశించింది. 
 
'నోర్మూసుకోండి (షటప్‌). లేదంటే బయటికి గెంటివేయిస్తా' అని హెచ్చరించారు. 'ఎందుకలా అరుస్తున్నారు? ఇది కోర్టా చేపల మార్కెట్టా? కోర్టులో హుందాగా వ్యవహరించాలి. కోర్టు హాలులో పద్ధతిగా నడుచుకోలేని వారంతా సీనియర్‌ లాయర్లు కావాలనుకుంటున్నారు! ఇదే అసలు సమస్య' అని వ్యాఖ్యానించారు. 
 
మరోసారి గొంతు పెంచి మాట్లాడొద్దని గట్టిగా కేకలు వేసిన ఒక న్యాయవాదిని ఉద్దేశించి హెచ్చరించారు. 'మాట్లాడొద్దు! మీరు ఈ కేసులో భాగస్వామి కాదు. సీనియర్‌ న్యాయవాది సొలీ సొరాబ్జీని చూసి, ఆయన నుంచి కొంత నేర్చుకోవడానికి ప్రయత్నించండి. గట్టిగా అరుస్తూ, చిటపటలాడితే మేలు జరుగుతుందనుకుంటున్నారా?' అని జస్టిస్‌ ఠాకూర్‌ ప్రశ్నించారు. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments