Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్రాస్ హైకోర్టులో గొడ్డుమాంసం వంటకాలను పంచిపెట్టిన...

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (19:10 IST)
మద్రాస్ హైకోర్టులో వినూత్న చర్యకు దిగారు. మద్రాస్ హైకోర్టులో శుక్రవారం మధ్యాహ్నం కొందరు లాయర్లు గొడ్డు మాంసంతో తయారైన వంటకాలను పంచారు. ఆవు మాంసం విక్రయంపైనా, కలిగివుండడంపైనా మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ వారు ఈ వినూత్న చర్యకు దిగారు. న్యాయవాదులు కోర్టు ప్రాంగణంలో గుమిగూడి పేపర్ కప్పుల్లో గొడ్డు మాంసం వంటకాలను అందించారు. దీంతో, అందరూ ఆశ్చర్యపోయారు. 
 
అనంతరం, లాయర్లు మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించి కరపత్రాలు పంపిణీ చేశారు. మహారాష్ట్ర సర్కారు ఇటీవలే యానిమల్ ప్రిజర్వేషన్ బిల్లు కింద గొడ్డు మాంసం విక్రయాలను నిషేధించింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. దీంతో మద్రాసు హైకోర్టు లాయర్లు వినూత్నంగా తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments