Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలు డేటా తింటారా? ఆటా తింటారా? ఇదేనా దేశాన్ని మార్చడం?: ప్రధానికి లాలూ ప్రశ్న

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన "జియో డిజిటల్ లైఫ్" ప్రకటనల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కనిపించడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఫుల్ పేజ్ పత్రికా ప్రకటనల్లో ప్రధాని నరేంద్ర

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (19:22 IST)
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన "జియో డిజిటల్ లైఫ్" ప్రకటనల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కనిపించడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఫుల్ పేజ్ పత్రికా ప్రకటనల్లో ప్రధాని నరేంద్ర మోడీ కనిపించడం విమర్శలకు దారితీసింది. దీనిపై ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సెటైర్లు వేశారు. ప్రధాని మోడీని ''మిస్టర్ రిలయన్స్" అంటూ కేజ్రీవాల్ కామెంట్ చేశారు. 
 
అలాగే ఆయన ప్రధాని కంటే ''రిలయన్స్''కు మోడలింగ్ చేసుకుంటే మంచిదని చురకటించారు. ప్రస్తుతం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ప్రధాన మంత్రిపై తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. "పేద ప్రజలు ఏం తింటారు: ఆటా (గోధుమ) లేదా డేటా?నా అంటూ ప్రశ్నించారు. 
 
తక్కువధరకు డేటా దొరుకితే.. ఎక్కువ ధరకు ఆటా లభిస్తోందని.. ఇదేనా దేశాన్ని మారుస్తామనడానికి మోడీ నిర్వచనం అంటూ అడిగారు. జియో సంస్థ డిజిటల్ ఇండియాకు ఊత మిస్తామని చెబుతూ కొత్తగా మార్కెట్‌లో తీసుకొచ్చే ''జియో" ప్రకటనలపై మోడీ బొమ్మను వాడుకోవడం వివాదాస్పదమైంది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments