Webdunia - Bharat's app for daily news and videos

Install App

కశ్మీర్‌లో ఆర్మీ క్యాంప్‍‌పై మళ్లీ దాడి.. అధికారితోపాటు ముగ్గురు జవాన్ల వీరమరణం

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్ము కశ్మీర్‌లో మరోసారి ఘాతుక చర్యకు బరితెగించారు. కుప్వారా సమీపంలోని అతి పెద్ద సైనిక క్యాంపుపై ఒక్కసారిగా ఉగ్రవాదులు విరుచుకుపడి చేసిన దాడిలో ఒక ఆర్మీ అధికారితో సహా మ

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (09:43 IST)
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్ము కశ్మీర్‌లో మరోసారి ఘాతుక చర్యకు బరితెగించారు. కుప్వారా సమీపంలోని అతి పెద్ద సైనిక క్యాంపుపై ఒక్కసారిగా ఉగ్రవాదులు విరుచుకుపడి చేసిన దాడిలో ఒక ఆర్మీ అధికారితో సహా ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. గురువారం తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో ఈ దాడి చోటుచేసుకుంది.ఇరు వర్గాల మధ్య దాదాపు నాలుగు గంటలపాటు కాల్పులు చోటుచేసుకున్నాయి. సమీప ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట కోనసాగుతోంది. 
 
ఈ ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులను కూడా సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. వారిని నిలువరించకుంటే ఆర్మీకి చెందిన సామాగ్రిని దోచుకోవడమో దానిపై ఆత్మాహుతిదాడికి పాల్పడటమో జరిగి ఉండేదని భావిస్తున్నారు. 
 
ఈరోజు జరిగిన దాడి గత సంవత్సరం యూరిలో జరిగిన దాడిని తలపించింది. ఆనాటి ఘటనలో 19 మంది సైనికులు ఉగ్రవాదుల దాడిలో నేలకొరిగారు. గురువారం తెల్లవారు జామున జరిగిన దాడిలో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. కేంద్ర హోమంత్రి రాజనాథ్ సింగ్ జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్తితిని అంచనా వేయడానికి భద్రతా సమీక్ష సమావేశాన్ని ఏర్పర్చనున్నారు. 
 
ఇదిలా ఉండగా నలుగురు జవాన్లను అగమేఘాల మీద శ్రీనగర్‌కు వైద్యచికిత్సకోసం తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే ఊహిస్తున్నదానికంటే ఎక్కువగానే సైన్యం దెబ్బతిందని తెలుస్తోంది. సైనిక బలగాల నుంచి సమగ్ర వివరణ ఇంకా రావలసే ఉంది. ఇద్దరు ఉగ్రవాదులు చావగా మిగిలిన వారికోసం సైన్యం గాలింపులను తీవ్రం చేసింది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments