కుంభమేళా ఎఫెక్ట్.. 102 మందికి కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (13:27 IST)
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా కల్లోలం రేపుతున్నది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది. ఉత్తరాఖండ్‌లోనూ రోజూ క్రమం తప్పకుండా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. 
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాపై కరోనా మహమ్మారి పంజా విసిరింది. కుంభమేళాకు హాజరైన మొత్తం 18,169 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా అందులో 102 మందికి పాజిటివ్ వచ్చింది.
 
కుంభమేళాకు వస్తున్న భక్తులు మాస్కులు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం లాంటి కొవిడ్ నిబంధనలను సరిగా పాటించకపోవడంవల్లనే కరోనా వైరస్ చాలామందిలో బయటపడిందని వైద్యసిబ్బంది చెబుతున్నారు. 
 
భక్తులు కొవిడ్ నిబంధనలను పాటించకపోవడానికి అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలావుంటే మాస్కులు పెట్టుకోని వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఉత్తరాఖండ్ పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అఖండ-2 కష్టాలు ఇంకా తీరలేదు.. త్వరలో కొత్త రిలీజ్ తేదీ

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments