Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపేశాడు... మామ జననాంగాలు కోసేసిన అల్లుడు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (19:00 IST)
వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణం జరిగింది. భార్యను చంపేసిన ఓ భర్త... ఆ తర్వాత పిల్లనిచ్చిన మామ జననాంగాలను కోసేశాడు. ఈ ఘటన ప‌శ్చిమ బెంగాల్ సోనాపూర్ లోని సుభాష్ గ్రామ్ ఏరియాలో శ‌నివారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బ‌సుదేవ్ గంగూలీ(76)కి సుమిత పండిట్ అనే కూతురు ఉంది. గంగూలీ సుమిత‌కు పెంపుడు తండ్రి. అయితే సుమిత‌ను ర‌మేశ్ అనే వ్య‌క్తికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే రమేశ్ గ‌త కొంత‌కాలం నుంచి ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతున్నాడు.
 
ఈ క్ర‌మంలో ర‌మేశ్, సుమిత మ‌ధ్య శుక్ర‌వారం రాత్రి తీవ్ర ఘ‌ర్ష‌ణ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్ర‌హానికి లోనైన ర‌మేశ్.. సుమిత‌, బ‌సుదేవ్‌పై క‌త్తితో దాడి చేశాడు. సుమిత ర‌క్త‌పు మ‌డుగులో ప‌డిపోయింది. బ‌సుదేవ్ జ‌న‌నాంగాల‌ను ర‌మేశ్ కోసేసి ప‌రారీ అయ్యాడు.
 
అయితే ఆదివారం బ‌సుదేవ్ నివాసంలో ఉన్న పూల‌ను కోసేందుకు పొరుగింటి వారు రావ‌డంతో మృత‌దేహాలు క‌న‌బ‌డ్డాయి. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న తండ్రికుమార్తెల మృత‌దేహాల‌ను చూసి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పరారీలో ఉన్న రమేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments