Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. తుప్పుపట్టిన వాహనాలు..

కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య కేసులో అన్నాడీఎంకే చెందిన కవుండంపాళయం ఎమ్మెల్యే ఆరుకుట్టి హస్తం ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు ఆయన్ని ప్రశ్నించారు. వాచ్‌మెన్ హత్య కేసులో అనుమానాస్పదుడిగా ఉండి, ఆపై హత్య

Webdunia
బుధవారం, 17 మే 2017 (09:50 IST)
కొడనాడు ఎస్టేట్ వాచ్‌మెన్ హత్య కేసులో అన్నాడీఎంకే చెందిన కవుండంపాళయం ఎమ్మెల్యే ఆరుకుట్టి హస్తం ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు ఆయన్ని ప్రశ్నించారు. వాచ్‌మెన్ హత్య కేసులో అనుమానాస్పదుడిగా ఉండి, ఆపై హత్య చేయబడిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత మాజీ డ్రైవర్ కనక్‌రాజ్ మృతి చెందే ముందు ఆరుకుట్టికి 300కు పైగా ఫోన్ కాల్స్ చేసినట్లు కాల్ హిస్టరీ చూపించడంతో పోలీసులు ఆయనను వివరించారు. 
 
కనకరాజ్, ఆరుకుట్టి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. పోలీసుల నుంచి సమన్లు అందుకున్న ఆరుకుట్టి విచారణకు హాజరు కాగా, ఆత్తూర్‌లో పోలీసులు ఆయన్ని ప్రశ్నించారు. ఈ కేసులో కనకరాజ్ అన్న ధనరాజ్ పాత్రపైనా పోలీసు వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
 
ఇదిలా ఉంటే.. జయలలిత మృతి తర్వాత పోయెస్ గార్డెన్ కళావిహీనంగా మారగా ఆమె వినియోగించిన కార్లు మూలనపడ్డాయి. ఆరు నెలలకు పైగా అలాగే ఉన్న రూ.50 లక్షల విలువైన ఆ వాహనాలు తుప్పు పడుతున్నాయి. ఆమె రాజకీయ వారసత్వం కోసం వర్గపోరు సాగుతుండగా ఆస్తుల సంగతి తెర వెనకే ఉండిపోయింది. జయలలిత ఆమె వీలునామా రాయకపోవడం, వారసులం తామే అంటూ సంబంధిత పత్రాలతో ఎవరూ రాకపోడంతో ఎటూ తేలకుండా ఉంది.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

తర్వాతి కథనం
Show comments