Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ స్టేడియాన్ని పేల్చివేస్తాం : ఖలీస్థాన్ టెర్రరిస్టుల హెచ్చరిక

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (08:54 IST)
ఖలీస్తానీ వేర్పాటువాది హర్దీబ్ సింగ్ నిజ్జర్ హత్య కేసు నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని పేల్చి వేస్తామని ఖలీస్తానీ ఉగ్రవాదులు హెచ్చరించారు. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన టెర్రరిస్ట్ గురుప్రత్వంత్ సింగ్ పన్ను హెచ్చరికలు జారీచేశాడు. ఈ మేరకు రికార్డు చేసిన ఓ వీడియోను రిలీజ్ చేశాడు. 
 
ఈ వీడియోలో భారత్‌తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు హెచ్చరిక జారీచేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిక్ ఫర్ జస్టిస్ గ్రూపు నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. 
 
ఐసీసీ ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్‌కు అక్టోబరు 5వ తేదీన ఈ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. దీంతో ఈ స్టేడియంపై దాడికి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. నిజ్జర్ హత్యపై మేం మీ బుల్లెట్‌కు వ్యతిరేకంగా మా బ్యాలెట్‌ను ఉపయోగించబోతున్నామని, తాము మీ హింసకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నామని చెప్పాడు. ఈ అక్టోబరు 5వ తేదీన జరిగేది ప్రపంచ వరల్డ్ కప్ కాదని, ఇది ప్రపంచ టెర్రర్ కప్ నాంది నాంది అన్నాడు. ఈ సందేశం గురుప్రత్వంత్ సింగ్ పన్ను నుంచి వచ్చిందని ఆ రికార్డింగ్లో ఉంది.
 
అలాగే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను అగౌరవపరిచినందుకు భారత రాయబారి వర్మను హతమారుస్తామని అందులో హెచ్చరించాడు. వర్మను భారత్‌తు తీసుకురావడం, ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయడం చాలా తెలివైన పని అన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments