Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ప్రణయ్ హత్య తరహాలోనే... కుమార్తె భర్తను చంపేసి కాలువలో పడేశారు...

Webdunia
గురువారం, 8 నవంబరు 2018 (12:46 IST)
కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో మిర్యాలగూడలో జరిగిన దళిత యువకుడు ప్రణయ్ హత్య కేసు తరహాలోనే మర్డర్ జరిగింది. ఆరు నెలల క్రితం జరిగిన ఈ హత్య కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 
 
కేరళలోని కొట్టాయంకు చెందిన నీనూ(21), జోసెఫ్(23) అనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. జోసెఫ్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వారు ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి నీనూ జోసెఫ్‌లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన యువతి కుటుంబం జోసెఫ్‌ను కిడ్నాప్ చేయించి, హత్య చేయించి అతని శవం చాలియెక్కర కెనాల్‌లో పడేసింది. రిజిస్టర్ మ్యారేజ్ జరిగిన 2 రోజులకే ఈ హత్య జరిగింది. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి.. ప్రమాదవశాత్తు కాలువలోపడి మరణించినట్టుగా పేర్కొని కేసు మూసేశారు. కానీ, మృతుని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీన్ని పరువు హత్యగా నిర్ధారించిన కొట్టాయం అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు... ఆరు నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments