Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మించాడు.. పురుగుల మందు తాపించి ఆపై రేప్ చేసి నగలు దోచుకున్న కామాంధుడు!

సహోద్యోగే కదా అని అతని మాటలు నమ్మింది. కష్టాల్లో ఉన్నాను ఆదుకోవాలని కోరడంతో మెడలోని చైన్ తాకట్టుపెట్టి డబ్బు సాయం చేసింది. ఆ తాకట్టుపెట్టిన చైన్ తెచ్చివ్వమని అడిగిన పాపానికి ఏకంగా పురుగుల మందు తాపించి

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (12:58 IST)
సహోద్యోగే కదా అని అతని మాటలు నమ్మింది. కష్టాల్లో ఉన్నాను ఆదుకోవాలని కోరడంతో మెడలోని చైన్ తాకట్టుపెట్టి డబ్బు సాయం చేసింది. ఆ తాకట్టుపెట్టిన చైన్ తెచ్చివ్వమని అడిగిన పాపానికి ఏకంగా పురుగుల మందు తాపించి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి.. ఆమె ధరించిన నగలను దోచుకుని పారిపోయిన దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ విషాదకర సంఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచ్చిలో జరిగింది. ఈ దారుణ హత్యకు గురైన మహిళ కేరళ రాష్ట్ర వాసి. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆమెకు వయస్సు 42 యేళ్లు. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వగ్రామం కోయంబత్తూరు అయినప్పటికీ.. త్రిశూర్‌కు వెళ్లి స్థిరపడ్డారు. కుటుంబ జీవనోపాధి కోసం ఆమె త్రిసూర్‌లోని గార్మెంట్ షాప్‌లో ఉద్యోగానికి చేరింది. అదే షాప్‌లో పనిచేసే సిజో అనే వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. అప్పటి నుంచి వారిద్దరు సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. 
 
దీంతో తనకు ఆర్థిక సమస్యలున్నాయని, ఇబ్బందుల్లో ఉన్నానని సిజో ఆమెను నమ్మించాడు. ప్రియుడిని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తన మెడలోని చైన్‌ను తాకట్టు పెట్టి డబ్బులు తీసిచ్చింది. కొద్దిరోజుల తర్వాత చైన్ తీసివ్వమని కోరగా, ఇద్దరం వెళ్లి తీసుకుందాం రమ్మని నమ్మబలికాడు. వారిద్దరు కలిసి బైక్‌పై బయలుదేరారు. 
 
బైక్‌‌పై పొల్లాచ్చి వెళుతూ మార్గమధ్యంలో సిజో బైక్ ఆపాడు. ఎందుకు ఆపావని అడగ్గా డ్రింక్ తాగి వెళదామని నమ్మించాడు. కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి ముందే పక్కా ప్లాన్‌తో ఉన్న సిజో ఆమెకు తాగమని ఇచ్చాడు. ఈ విషయం తెలియని ఆమె డ్రింక్ తాగింది. కొద్దిసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను రేప్ చేసి, ఒంటిమీద ఉన్న నగలు తీసుకెళ్లాడు. 
 
పొలాచ్చి సమీపంలోని పూసరిపట్టి గ్రామంలోని పొలాల్లో ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. అటుగా వెళుతున్న కొందరు గమనించి ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె తనువు చాలించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిజో ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments