Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో 'నిఫా' వైరస్... వైద్యుల పర్యవేక్షణలో 86 మంది రోగులు

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (11:02 IST)
కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్‌ను గుర్తించారు. కొచ్చిన్‌కు చెందిన ఓ రోగిలో ఈ వైరస్‌ను గుర్తించినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కెకె.శైలజ అధికారికంగా వెల్లడించారు. అలాగే, వైద్యుల పర్యవేక్షణలో మరికొంతమంది ఉన్నట్టు తెలిపారు. ఈ రోగి 23 యేళ్ల కాలేజీ విద్యార్థి అని చెప్పారు. 
 
ఇదే అంశంపై మంత్రి శైలజ మాట్లాడుతూ, నిఫా వైరస్ సోకిన రోగిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఆ రోగికి పూణెకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగం వైద్యులు జరిపిన పరిశోధనలో నిఫా వైరస్ సోకినట్టు తేలిందని, ఆ రోగిని ఎర్నాకులంలోని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. 
 
దీనిపై మంత్రి శైలజ మాట్లాడుతూ, జ్వరం లక్షణాలతో ఇద్దరు ఆస్పత్రిలో చేరారు. వారిలో ఒకరికి నిఫా వైరస్ సోకినట్టు తేలింది. మరొకరు జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. అయితే, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు చేపట్టామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె తెలిపారు. ఇదిలావుండగా, కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 86 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments