Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల దర్శనానికి వెళ్లే స్వాములు.. ఇలా చేయాల్సిందే..

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (17:04 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో సుప్రసిద్ధ ఆలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. తిరుమలలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇలా పలు ఆలయాల్లో భక్తులు లేని ఉత్సవాలు, పూజలు జరిగిపోతున్నాయి. ఇదే తరహాలో ప్రసిద్ధ ఆలయం శబరిమలలోనూ భక్తలు దర్శనం ఆంక్షలు విధించడం జరిగింది. శబరిమల దర్శనానికి వెళ్లే స్వాములను దృష్టిలో పెట్టుకుని కొన్ని నిబంధనలు చేసింది. 
 
మండల పూజలకు, మకరజ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు శబరిమల సన్నిధానంలో బస చేసేందుకు అనుమతి లేదని దేవస్థానం బోర్డు పేర్కొంది. కరోనా కారణంగా మార్చి నుంచి శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూసివేశారు. నవంబరులో జరిగే మండల పూజల కోసం ఆలయాన్ని తెరవనున్నారు. 
 
శబరిమలకు వచ్చే భక్తులకు నీలకల్ ప్రాంతంలో కరోనా పరీక్షలు నిర్వహించి రోజుకు ఐదు వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని బోర్డు నిర్ణయించింది. 18 మెట్ల వద్ద పోలీసులు ఉండరు. భక్తులు తమకు తామే ఎక్కి వెళ్లాలని బోర్డు పేర్కొంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర నుంచి వచ్చే భక్తులు కొన్ని రోజులు సన్నిధానంలో బస చేసి వెళ్తుంటారు. అయి ఈ సారి భక్తులు బస చేయడానికి అనుమతి లేదని దేవస్థానం అధికారులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments