Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజ్రీవాల్ పశ్చాత్తాపంపై గజేంద్ర తండ్రి మండిపాటు.. మీ క్షమాపణ మా కొడుకును బతికిస్తుందా?

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2015 (13:14 IST)
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రైతు గజేంద్ర ఆత్మహత్యపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘తప్పు జరిగింది’ అని పశ్చాత్తాపం వ్యక్తం చేయగా, మృతుని తండ్రకి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పశ్చాత్తాపం నా కొడుకును బతికించగలదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే, తమ బిడ్డ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
 
కాగా, రైతు ఆత్మహత్యపై రెండు రోజులపాటు మౌనం వహించిన కేజ్రీవాల్.. శుక్రవారం రైతు కుటుంబాన్ని క్షమాపణ కోరారు. ఈ క్షమాపణ ను గజేంద్ర కుటుంబం తిరస్కరించింది. దానివల్ల తమకు ఒరిగేదేమీ లేదంది. ‘నేను తప్పుచేశాను. ఘటన తర్వాత నా ప్రసంగాన్ని ఆపాల్సింది... కొనసాగించడం ద్వారా ప్రజలను, గజేంద్ర కుటుంబాన్ని బాధపెట్టాను. ఆయన కుటుంబాన్ని క్షమాపణ కోరుతున్నా’ అన్నారు. 
 
‘ఈ విషయంలో తప్పు చేసిన వారిని అవసరమైతే ఉరితీయండి. కానీ రైతు ఆత్మహత్యలకు కారణమైన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించండి’ అని కేజ్రీ పార్టీలను కోరారు. ఘటన రోజు తన మనసు వికలమై, ఆ రాత్రి నిద్ర పోలేదన్నారు. ఆత్మహత్యపై పోలీసులను నిందించడమూ తప్పేనన్నారు. అయితే కేజ్రీ పశ్చాత్తాపంపై గజేంద్ర తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆయన క్షమాపణ మా కొడుకును బతికిస్తుందా?’ అని ప్రశ్నించారు. ‘ఆయన కొడుక్కు ఏదైనా అయితే నేను క్షమాపణ చెబితే సరిపోతుందా? అని గజేంద్ర తండ్రి బన్నేసింగ్‌ ప్రశ్నించారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments