Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ కామెంట్స్ ఎఫెక్ట్... భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు బ్యాంకు వివరాలు చెప్పండి... మోదీ

సోమవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనువెంటనే ఆచరిస్తున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే నిన్న రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... నల్లడబ్బు అంటూ సామాన్యులను మాత్రమే టార్గెట్ చేసి వదిలేస్తే ప

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (14:24 IST)
సోమవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనువెంటనే ఆచరిస్తున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే నిన్న రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... నల్లడబ్బు అంటూ సామాన్యులను మాత్రమే టార్గెట్ చేసి వదిలేస్తే పారదర్శకత ఉన్నట్లు కాదనీ, అందువల్ల రాజకీయ నాయకులు సైతం వారివారి ఆస్తుల వివరాలన్నిటినీ ప్రజలకు తెలియజేయాలనీ, వారి వద్ద ఉన్న ధనం ఎంతో లెక్కచెప్పినప్పుడే ప్రజలు కూడా సమస్య పట్ల మరింత సానుకూలంగా ఉంటారని అన్నారు. ఈ మేరకు కేసీఆర్ మీడియాముఖంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పిలుపునిచ్చారు. 
 
ఈ నేపధ్యంలో మంగళవారం నాడు ప్రధానమంత్రి మోదీ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా తమతమ బ్యాంకు ఖాతా వివరాలన్నిటినీ నవంబరు 8 నుంచి డిసెంబరు 31 లోపు సమర్పించాలని కోరారు. ఆ వివరాలన్నీ భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు అందజేయాలన్నారు. 
 
సామాన్య ప్రజలను వేధిస్తూ మీరు మాత్రం నల్లడబ్బును దాచుకుంటున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు నరేంద్ర మోదీ ఈ చర్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఏదైతేనేం ధనవంతులు తమ డబ్బును పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి జీవితాల్లో వెలుగు రేఖలు పూస్తాయనడంలో సందేహంలేదు. మరి ఈ కార్యక్రమం ఎంతమేరకు ముందుకు వెళుతుందో చూద్దాం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments