కేసీఆర్ కామెంట్స్ ఎఫెక్ట్... భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు బ్యాంకు వివరాలు చెప్పండి... మోదీ

సోమవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనువెంటనే ఆచరిస్తున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే నిన్న రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... నల్లడబ్బు అంటూ సామాన్యులను మాత్రమే టార్గెట్ చేసి వదిలేస్తే ప

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (14:24 IST)
సోమవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనువెంటనే ఆచరిస్తున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే నిన్న రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... నల్లడబ్బు అంటూ సామాన్యులను మాత్రమే టార్గెట్ చేసి వదిలేస్తే పారదర్శకత ఉన్నట్లు కాదనీ, అందువల్ల రాజకీయ నాయకులు సైతం వారివారి ఆస్తుల వివరాలన్నిటినీ ప్రజలకు తెలియజేయాలనీ, వారి వద్ద ఉన్న ధనం ఎంతో లెక్కచెప్పినప్పుడే ప్రజలు కూడా సమస్య పట్ల మరింత సానుకూలంగా ఉంటారని అన్నారు. ఈ మేరకు కేసీఆర్ మీడియాముఖంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పిలుపునిచ్చారు. 
 
ఈ నేపధ్యంలో మంగళవారం నాడు ప్రధానమంత్రి మోదీ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా తమతమ బ్యాంకు ఖాతా వివరాలన్నిటినీ నవంబరు 8 నుంచి డిసెంబరు 31 లోపు సమర్పించాలని కోరారు. ఆ వివరాలన్నీ భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు అందజేయాలన్నారు. 
 
సామాన్య ప్రజలను వేధిస్తూ మీరు మాత్రం నల్లడబ్బును దాచుకుంటున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు నరేంద్ర మోదీ ఈ చర్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఏదైతేనేం ధనవంతులు తమ డబ్బును పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి జీవితాల్లో వెలుగు రేఖలు పూస్తాయనడంలో సందేహంలేదు. మరి ఈ కార్యక్రమం ఎంతమేరకు ముందుకు వెళుతుందో చూద్దాం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments